ముద్గల పురాణంలో కణ్వమహర్షి, భరతుడికి భాద్రపద శు: చవితి గణపతి వ్రత మహిమ, పూజానియమాల గురించి, మట్టిగణపతి ఆవశ్యకత, ఏకవింశతి పత్రార్చన గురించి చెప్పినట్లు స్పష్టముగా ఉన్నది.

జడపదార్దమైన భూమికి చైతన్యం కల నీళ్ళతో చేరినపుడు భూమి ఆహారపదార్ధాలను, ఔషదులను అందిస్తుంది. అంటే ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా భూతత్వానికి అధిష్ఠాన దేవత మరియు మూలధార చక్రానికి అధిదేవతయైన గణపతిని పూజిస్తారు. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నుండి త్రయోదశి వరకు 11 రోజుల పాటు అంగరంగవైభవంగా, నేత్రపర్వముగా, భుక్తి, ముక్తి , ఫలదాయకముగా నిర్వహించబడును .

మరకత శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవములో స్వామి వారు ఒక్కక్కరోజు ఒక్కొక అవతారములో దర్శనమిస్తారు. స్వామి వారు వరసిద్ధి , మహా గణపతి, వికట, లంభోదర, గజానన,మహోధర, ఏకదంత, వక్రతుండ, విఘ్నరాజ, దూమ్రవర్ణ, చివరి రోజున మరకత శ్రీలక్ష్మీ గణపతిగా దర్శనమిస్తారు.

అభిషేక, హోమాదుల తరువాత ఏకవింశతి దివ్యపత్రములలో దివ్యపత్రార్చన జరిపి తదనంతరం మహానీరాజనాలు, తీర్థప్రసాద వితరణ జరుగుతాయి.

ఏకవింశతి దివ్యపత్రములతో గణపతి సహస్రనామార్చన

గమనిక: 11 రోజులు వరుసగా అభిషేక, హవన, ఏకవింశతి పత్రార్చనలో పాల్గొనిన వారికి మరకత గణపతి లాకెట్ మరియు లక్ష్మీ గణపతి యంత్ర సహిత వెండి డాలర్ మహాప్రసాదంగా ఇవ్వబడును.