సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో – ఉ|| 7:00 నుండి 8:00 గం. ల వరకు , బుధ, శని, ఆదివారాల్లో – సా|| 7:00 నుండి 8:00 గం. ల వరకు స్వామి వారికి సహస్రనామార్చన నిర్వహించబడును.
ఆది ప్రణవరూపుడు, పరబ్రహ్మస్వరూపుడై , షోడశకళానిధియై , విశ్వమంతా వ్యాపించియున్న మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి భక్తితో షోడశోపచార పూజలు నిర్వహించుట ద్వారా అనగా ధ్యానము, ఆవాహనము, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానము, పంచామృతాభిషేకం, ఉత్తరీయము, గంలేపనములు, కిరీటాభరణములు, పసుపు , కుంకుమ, అక్షత, సూపా, దీప, నైవేద్య, తాంబూలములు, సహస్రనామ స్త్రోత్రము , చత్ర , చామర, నృత్య, గీత, ఆశ్వ, మంత్రపుష్ప సమస్త రాజపచారాది పూజాది క్రియలలో భక్తిగా అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.
త్రిపురాసుర సంహారానికి ముందు శివుడు , విఘ్నాధిపతిని ప్రార్ధించగా ఎం గణపతే తన సహస్రనామాలను స్వయంగా ఈశ్వరునికి చెప్పాడని గణేశ పురాణంలో చెప్పబడింది. అటువంటి మహిమాన్పితమైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి సహస్రనామార్చనను , ఆశ్లేషా ,జ్యేష్టా, రేవతి నక్షత్రాలవారు, వృషభ , మిధున, కన్యా, వృశ్శిక, మీనా రాసుల వారు, 5,7,14,16, 23,25 తేదీలలో జన్మించిన భక్తులు పాల్గొని పూజించి, ఆరాధించిన వారికి చతుర్విద ఫల పురుషార్ధములనిచ్చి , అష్టైశ్వర్య, అభీష్ట, కార్యసిద్ధిని కలిగించి, పూర్వ జన్మ పాప కర్మలను తొలిగించి కాళీ మృత్యు భయ దోషాలను హరించి , మనః శాంతిని, ఆ నందాన్ని కల్గించునని ముద్గల పురాణములో చెప్పబడింది.
“శ్రవణం కీర్తనం విష్ణు: స్మరణం పాదసేవనమ్ అర్చనం|
వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్”
అని వేదవ్యాసుడు భాగవతంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన “సహస్రనామార్చన” ద్వారం అతిశీఘ్రముగా మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి పరిపూర్ణ కరుణా కటాక్షములను పొందవచ్చును.
